|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 32 అధ్యాయము | ||
32 రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని | 2 వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో | 3 -అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా | 4 ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు. | 5 కాబట్టి మా యెడల నీకు కటాక్షము కలిగిన యెడల, మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా | 6 మోషే గాదీయులతోను రూబేనీయులతోను-విూ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా విూరు ఇక్కడ కూర్చుండవచ్చునా? | 7 యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు విూరేల వారి హృదయములను అధైర్యపరచుదురు? | 8 ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలో నుండి విూ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరి గదా. | 9 వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లకపోయిరి. | 10 ఆ దినమున యెహోవా కోపము రగులుకొని | 11 -ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప | 12 మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను. | 13 అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల విూద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరు నశించు వరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను. | 14 ఇప్పుడు ఇశ్రాయేలీయుల యెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన విూరు విూ తండ్రులకు ప్రతిగా బయలుదేరి యున్నారు. | 15 విూరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లిన యెడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంక నిలువచేయును. అట్లు విూరు ఈ సర్వజనమును నశింప చేసెదరనెను. | 16 అందుకు వారు అతని యొద్దకు వచ్చి- మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. | 17 ఇశ్రాయేలీయులను వారి వారి స్థలమును చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయముచేత ప్రాకారముగల పురములలో నివసింపవలెను. | 18 ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా యిండ్లకు తిరిగి రాము. | 19 తూర్పు దిక్కున యొర్దాను ఇవతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి. | 20 అప్పుడు మోషే వారితో-విూరు విూ మాటవిూద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన యెదుట నుండి తన శత్రువులను వెళ్లగొట్టు వరకు | 21 యెహోవా సన్నిధిని విూరందరు యుద్ధ సన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్లిన యెడల | 22 ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత విూరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై యుందురు; అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని విూకు స్వాస్థ్యమగును. | 23 విూరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక విూ పాపము మిమ్మును పట్టుకొనును1 అని తెలిసి కొనుడి. | 24 విూరు విూ పిల్లల కొరకు పురములను విూ మందల కొరకు దొడ్లను కట్టుకొని విూ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను. | 25 అందుకు గాదీయులును రూబేనీయులును మోషేతో-మా యేలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము. | 26 మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. | 27 నీ దాసులమైన మేము, అనగా మా సేనలో ప్రతి యోధుడును మా యేలిన వాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యొర్దాను అద్దరికి వచ్చెదమనిరి. 28 కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను | 29 -గాదీయులును రూబేనీయులును అందరు యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి విూతో కూడ యొర్దాను అవతలికి వెళ్లిన యెడల ఆ దేశము విూచేత జయింపబడిన తరువాత విూరు గిలాదు దేశ మును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను. | 30 అయితే వారు విూతో కలిసి యోధులై ఆవలికి వెళ్లని యెడల వారు కనాను దేశమందే విూ మధ్యను స్వాస్థ్యములను పొందు దురనగా | 31 గాదీయులును రూబేనీయులును-యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము. | 32 మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నది దాటి కనాను దేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి. | 33 అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను. | 34-35 గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను | 36 అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. | 37 రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను | 38 షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి. | 39 మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదు విూదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి. | 40 మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను. | 41 అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను. | 42 నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను. |
||
| Previous | ||