|
||
Previous | ||
ఆదికాండము 33 అధ్యాయము | ||
33 యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో నాలుగు వందలమంది మనుష్యులును వచ్చుచుండిరి. | 2 అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి | 3 తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సవిూపించు వరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను. | 4 అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడవిూద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి. | 5 ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి -వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. | 6 అప్పుడు ఆ దాసీలు వారి పిల్లలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. | 7 లేయాయు ఆమె పిల్లలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిల పడిరి. | 8 ఏశావు-నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు-నా ప్రభువు కటాక్షము నా విూద వచ్చుటకే అని చెప్పెను. | 9 అప్పుడు ఏశావు - సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను. | 10 అప్పుడు యాకోబు-అట్లు కాదు; నీ కటాక్షము నా విూదనున్న యెడల చిత్తగించి నాచేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నా విూద వచ్చినది గదా; | 11 నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని | 12 -మనము వెళ్లుదము; నేను నీకు ముందుగా సాగిపోవుదు నని చెప్పగా | 13 అతడు-నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలిన యెడల ఈ మంద అంతయు చచ్చును. | 14 నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చువరకు, నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పగా | 15 అప్పుడు ఏశావు-నీకిష్టమైన యెడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు-అదియేల? నా ప్రభువు కటాక్షము నా విూద నుండనిమ్మనెను. | 16 ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగి పోయెను. | 17 అప్పుడు యాకోబు సుక్కోతుకు1 ప్రయాణమై పోయి తనకొక యిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. | 18 అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. | 19 మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారుల యొద్ద నూరు వరహాలకు కొని | 20 అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేము ఇశ్రాయేలు2 అను పేరు పెట్టెను. 1. పాకలు. 2. అనగా, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. |
||
Previous |